ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిందని వైసీపీ ఎంపీలు తెలిపారు. ప్రత్యేక హోదా వస్తే...ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎంపీలు విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో తమ ఆందోళన కొనసాగుతుందంటున్నారు వైసీపీ ఎంపీలు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి బుధవారం లోక్సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు.