ప్రియురాలిని హత్య చేసి.. ఆపై ప్రియుడు..

Update: 2018-06-20 04:27 GMT

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పోలవరం బాపూజీ కాలనీలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించి, మరొరికితో పెళ్లికి ఒప్పుకుందని లహరి అనే యువతిని కత్తితో గొంతు కోసి చంపాడు. ఆ పై తాను పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాపూజీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమ పేరుతో కిరణ్‌ గత కొంత కాలంగా లహరిని వేధిస్తున్నాడు. అతనిపై ఆ యువతిని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇటీవల ఆ యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. మృతులు జంగారెడ్డిగూడెంకు చెందిన లహరి, కిరణ్‌లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News