వంగవీటి రాధాను కలిసిన విజయసాయిరెడ్డి

Update: 2018-10-11 02:27 GMT

వైసీపీ నేత వంగవీటి రాధాను ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. విజయవాడలోని  రాధా నివాసంలో వీరిద్దరు దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో అలిగిన రాధాను బుజ్జగించేందుకు విజయసాయిరెడ్డి కలిశారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రాధాను మచిలీపట్టణం పార్లమెంటు స్థానానికి పోటీ చేయవలసిందిగా విజయసాయిరెడ్డి కోరినట్టు తెలుస్తోంది. రాధా కూడా ఈ నిర్ణయానికి ఒకే చెప్పినట్టు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే  అవకాశముంది. 

Similar News