జుక్కల్‌ టీఆర్ఎస్‌ అభ్యర్థిపై మహిళల ఆగ్రహం

Update: 2018-11-05 08:27 GMT

గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు నిరసన సెగలు ఆగడం లేదు. తాజాగా నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేను మహిళలు అడుగడుగునా అడ్డుకున్నారు. మద్నూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షిండేను మహిళలు అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారం కాలేదంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ప్రచార రథానికి అడ్డుగా వచ్చి నినాదాలు చేశారు. మరోవైపు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హన్మంత్‌ షిండేకు వ్యతిరేకంగా సంగారెడ్డి, నాందేడ్‌ జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా చేపట్టారు. 

Similar News