హైదరాబాద్ పంజాగుట్టలో సూసైడ్ చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బయటకు వస్తున్న ఆడియో టేపులతో ప్రశాంత్ భార్య పావనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్థిస్థాయిలో విచారణ చేస్తున్నారు. పావని తన ప్రియుడు ప్రణయ్తో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
వరంగల్కు చెందిన పావనికి కామారెడ్డికి చెదిన ప్రశాంత్తో 2014లో పెళ్లి అయింది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. పావనికి పెళ్లికి ముందే ప్రణయ్ తో పరిచయం ఉంది. ఈ మధ్య ప్రణయ్తో క్లోజ్గా మూవ్ అయింది. ఇటీవలే పావని బెంగళూరుకు జాబ్ ట్రాన్స్ఫర్ చేయించుకుని. అక్కడే ప్రణయ్ తో కలిసి ఉంటునట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ప్రశాంత్ కలిసి కాపురం చేద్దామని పావనిని కోరాడు. అయితే తాను ప్రణయ్తోనే ఉంటానని ఆమె తేల్చిచెప్పడంతో రెండునెలలుగా డిప్రెషన్లోకి వెళ్లిపోయిన ప్రశాంత్ ఆత్మహత్య చేసుకునట్లు బంధువులు చెబుతున్నారు.