రేపు నల్గొండలో కేసీఆర్ సభ నేపథ్యంలో అసమ్మతి నేతలపై హైకమాండ్ వేటు వేస్తోంది. మునుగోడు టీఆర్ఎస్ నేత వేనేపల్లి వెంకటేశ్వరరావును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వేనేపల్లి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. మునుగోడు సీటును ఆశించిన వెంకటేశ్వరరావును పలుమార్లు బుజ్జగించారు. అయినా ఆయన వినలేదు. దీంతో పార్టీ నుంచి బహిష్కరించారు. అలాగే నల్గొండ, నాగార్జున సాగర్, తుంగతుర్తిలో అసమ్మతి నేతల వేటు వేసే అవకాశం అవకాశం ఉంది.