తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి....కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అర గంటకు పైగా తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, కమిటీల కూర్పుపై చర్చించేందుకు కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్తో ఉత్తమ్ భేటీ కానున్నారు. తెలంగాణకు ముగ్గురు ఇంచార్జ్ సెక్రటరీలు, మరో ఇంచార్జ్ జాయింట్ సెక్రటరీ నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు స్థానం కల్పించేందుకు ఉత్తమ్ చర్చలు జరుపుతున్నారు.