రవితేజ- రాశిఖన్నా-సీరత్కపూర్ కాంబినేషన్లో రానున్న మూవీ ‘టచ్ చేసి చూడు’. అన్నిపనులు పూర్తి కావడంతో ప్రమోషన్ లో నిమగ్నమైంది యూనిట్. ఈ చిత్రానికి రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ రిలీజ్ చేసింది యూనిట్. ట్రైలర్లో రవితేజ కుటుంబం గురించి వివరిస్తూ..‘ఎ ఫ్యామిలీ ఈజ్ యాన్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్. అసలు ఫ్యామిలీ అంటే..’ అని చెప్తుండగా వెనక నుంచి ‘వద్దురా రేయ్ వద్దు..’ అన్న డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. పోలీస్ గెటప్లో రవితేజ మరోసారి అదరగొట్టేశాడు. ‘యూనిఫాంలో ఉంటే ఆరే బుల్లెట్లు. యూనిఫాం తీసేస్తే రాయితో చంపుతానో రాడ్తో చంపుతానో నాకే తెలీదు’ అని చెప్తున్న డైలాగ్ హైలైట్గా నిలిచింది.
నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.