అమెరికాలో తెలుగు యువకుడు దుర్మరణం చెందాడు. స్నేహితులతో కలిసి మాన్రో సరస్సులో బోటింగ్కు వెళ్లిన అనూప్(26) ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. బోటింగ్ సమయంలో అనూప్ ఈతకొడుతున్నాడని తమని చూస్తూ చూస్తూ అందులో గల్లంతయ్యాడని స్నేహితులు వెల్లడించారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది అనూప్ మృతదేహాన్ని వెలికి తీశారు. తెలుగు రాష్ట్రానికి చెందిన అనూప్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.