విజయశాంతి ప్రచార సభలో అపశ్రుతి

Update: 2018-10-13 02:08 GMT

నిన్న(శుక్రవారం) అచ్చంపేటలో నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభా వేదికపై భట్టి విక్రమార్క, విజయశాంతి ఉండగా స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. విజయశాంతి మాట్లాడేందుకు ముందుకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయారు. అప్రమత్తమైన కొందరు మహిళా నేతలు విజయశాంతిని పైకి లేపారు. అయితే ఎవరికీ పెద్దగా ప్రమాదం కాకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా పెద్దఎత్తున కార్యకర్తలు విజయశాంతికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వాలని ముందుకు రావడంతో వేదిక కుప్పకూలాడు కారణంగా తెలుస్తోంది.

Similar News