క్లాస్ రూంలో విద్యార్థినితో జడ వేయించుకున్న టీచరమ్మ

Update: 2018-07-05 08:44 GMT

జనగాం జిల్లా నర్మెట్ట మోడల్ స్కూల్‌లో ఫిజిక్స్ టీచర్ నిర్వాకాన్ని స్టూడెంట్స్ బయటపెట్టారు. తలనొప్పిగా ఉందని ఫిజిక్స్ టీచర్ పార్వతి.. తొమ్మిదో తరగతి విద్యార్థినితో తలకు ఆయిల్‌తో మసాజ్ చేయించుకుంది. అది పూర్తైన తర్వాత.. క్లాస్ రూంలోనే జడ కూడా వేయించుకుంది. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఘటన మీద డీఈఓ విచారణకు ఆదేశించారు.

Similar News