సీఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం షోకాజ్‌ నోటీసులు

Update: 2018-09-28 08:16 GMT

తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఓటర్ల జాబితాలో సుమారు 70 లక్షల ఓట్లపై స్పష్టత రావాల్సి ఉందంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు తెలంగాణా ప్రభుత్వానికి షోకాజు నోటీసులు జారీ  చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
 

Similar News