ఏపీలో అధికారాన్ని శాసిస్తాం : సోము వీర్రాజు

Update: 2017-12-18 15:52 GMT

2019 ఎన్నికల్లో సీట్లను యాచించే స్థితిలో బీజేపీ ఉండదని... అధికారపక్షాన్ని డిసైడ్ చేసే స్థాయిలో ఉంటామని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఏపీ, తెలంగాణల్లో పుంజుకునేందుకు తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టి సారించారని... ఇరు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. అయితే, సోము వీర్రాజు వ్యాఖ్యకు టీడీపీ కౌంటర్‌ ఇచ్చింది. పగటి కలలు కనడం మానుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ హితవు పలికారు.


 

Similar News