జమ్మూ కశ్మీర్ను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు బోర్డర్లోకి చొరబడడంతో.. భారత సైన్యం ఇంకాస్త అలర్ట్ అయ్యింది. అడుగడుగూ గాలిస్తోంది. దాదాపు వారం నుంచి ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటే.. మన బలగాలు తిప్పి కొడుతున్నాయి. ఈ వారం రోజుల్లో పది మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మరోవైపు వరుస ఎన్కౌంటర్ల కారణంగా మతఘర్షణలతో జమ్మూ ప్రాంతం అట్టుడుకుతోంది.