కొత్త సంవత్సరం సందర్భంగా ఎస్ బీఐ తన కష్టమర్లకు శుభవార్త అందించింది. కష్టమర్లు అందించే వడ్డీరేటును 30బేస్ పాయింట్లకు తగ్గించింది. గతంలో వడ్డిరేట్లు 8.95శాతం ఉంటే ఇప్పుడు వడ్డీరేటు 8.65 శాతానికి తగ్గింది. ఈ వడ్డీరేట్లు 2018 జనవరి 1 నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో హోం లోన్ , ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నవారికి ఊరటలభించింది. ఈ తగ్గించిన వడ్డీరేట్లు 2016 ఏప్రిల్కు ముందు బేస్ రేట్ ఆధారంగా రుణాలు తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. చివరి సారిగా గతేడాది సెప్టెంబర్లో 9 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8.95 శాతానికి తగ్గించింది.