బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన ప్రభాస్ సాహో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సాహో సినిమా గురించి రూమర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. టీ సిరీస్ కు చెందిన లార్గో విన్చ్ సినిమా వివాదం అజ్ఞాతవాసిని చుట్టుముట్టిన విషయం తెలిసిందే. తన సినిమాను డైరక్టర్ త్రివిక్రమ్ కాపీ కొట్టారని..రైట్స్ కోసం భారీ మొత్తం చెల్లించాలని టీ సిరీస్ కోర్టుకెక్కింది. దీంతో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో వివాదం కరెక్ట్ కాదని భావించిన కొంతమొత్తం చెల్లించి ఆ వివాదం నుంచి బయటపడింది. ఇదిలా ఉంటే లార్గోవిన్చ్ వివాదం ‘సాహో’ను కూడా ఇరటకాటంలో పెట్టినట్లు టాక్. ఆ సినిమాని పోలిన సన్నివేశాలు, షాట్స్ సోహో లో లేకుండా జాగ్రత్తపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లార్గోవిన్చ్ సంబంధించిన సీన్లు తొలగించి అవసరమైతే రీషూట్ చేయాలని భావిస్తోందట ‘సాహో’ టీమ్. కాగా టీ సిరీస్ సంస్థ తమ సినిమానీ కాపీ కొడుతున్నారంటూ ఇప్పటికే కొన్ని సినిమాలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.