డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన
కృష్ణా జిల్లా పెదపారుపుడి మండల పరిధిలో జరిగింది. హైదరాబాద్ నుంచి నరసాపురం వెళ్తుండగా వానపాముల వద్ద బస్ పంట కాలుపలోకి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు... కాగా బస్సులో 40మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.