ఘోర ప్రమాదం... ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి...

Update: 2018-05-09 06:46 GMT

ఓ కారు ఎదురుగా వస్తున్న లారి ట్రక్కును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం ఉదయ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.ఓ కార్యక్రమం నిమిత్తం కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్నకారు వేగంగా వెళుతున్న కారణంగా అదుపు తప్పిలారి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో భారీ ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్ర గాయాలతో ప్రాణాలొ కోల్పోయారు. ఇదిలావుంటే  వారంరోజుల క్రితమే ఇదే జిల్లాలో ట్రక్కు ప్రమాదానికి గురై దాదాపు 25 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

Similar News