ప్రధాని మోడీ, కేసీఆర్ కలిసి ఆడుతోన్న నాటకంలో భాగంగానే ఓటుకు నోటు కేసును తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమని భయపెట్టో, బెదిరించో లొంగదీసుకుని రాజకీయ పరంగా ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసుకి సంబంధించి వివరాలు చెప్పాలని తాను అనుకోవట్లేదని, ఈ విషయంపై మాట్లాడవద్దని కోర్టు ఆంక్షలు విధించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. తమని భయపెట్టో, బెదిరించో లొంగదీసుకుని రాజకీయ పరంగా కొందరు ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారని, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసి ఆడుతోన్న నాటకంలో భాగమే నిన్నటి వ్యవహారమని అన్నారు.
ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసుకి సంబంధించి వివరాలు చెప్పాలని తాను అనుకోవట్లేదని, ఈ విషయంపై మాట్లాడవద్దని కోర్టు ఆంక్షలు విధించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ తీరుని మాత్రం ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం నిన్న పలువురు అధికారులతో కేసీఆర్ ఏడు గంటలు ఓటుకు నోటు కేసుపై చర్చించారని అన్నారు.