రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు

Update: 2018-09-12 07:47 GMT

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 15రోజుల్లో హాజరుకావాలని రేవంత్ రెడ్డితో పాటు 13మందికి పోలీసులు నోటీసులిచ్చారు. అయితే, ఎన్నికల బిజీలో ఉన్నందున విచారణకు రాలేనని రేవంత్ రెడ్డి లేఖను రాశారు. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో.. సెక్షన్ 41 సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు పంపారు.  

Similar News