పేటీఎం కరో ...నయా రోకో!

Update: 2018-08-02 11:48 GMT

పేటీఎం మొబైల్ డబ్బులకి,
ఇక ఆపారు కొత్త సభ్యులకి,
ఆర్బిఐ ఆగమని చెప్పిందని,
 ఏవో కొన్ని మార్పులు చేస్తామని,
అంటున్నారు "పేటిఎం కరో" "వారు". శ్రీ.కో

మొబైల్ వాలెట్ అయిన పేటీఎం కొత్త కస్టమర్ల ఎన్‌రోల్‌మెంట్‌ను ఆపేసింది. ఆర్బీఐ ఆదేశాల మేరకే పేటీఎం ఈ పని చేసినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. జూన్ 20 నుంచి కొత్త కస్టమర్ల ఎన్‌రోల్‌మెంట్ ఆగిపోయింది. ప్రధానంగా పేటీఎం కొత్త కస్టమర్లను చేర్చుకునే ప్రక్రియపై ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇక నో యువర్ కస్టమర్ నిబంధనల ఉల్లంఘన కూడా జరిగినట్లు గుర్తించారు. దీనికితోడు పేటీఎం తన అకౌంట్ ఓపెనింగ్ ప్రక్రియలో మార్పులు కూడా చేస్తున్నది. అందువల్ల కూడా ప్రస్తుతానికి కొత్త కస్టమర్లను చేర్చుకునే ప్రక్రియ ఆగిపోయినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

Similar News