గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మృతి

Update: 2018-11-05 09:32 GMT

మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలుండగా బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌పూర్ బీజేపీ అభ్యర్థి దేవి‌సింగ్ పటేల్ గుండెపోటుతో సోమవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో గత కొంతకాలం నుంచి చికిత్స పొందుతున్న పటేల్.. గుండెపోటు రావడంతో బర్వాణీ హాస్పిటల్‌లో ఉదయం 5గంటలకు తుదిశ్వాస విడిచారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నాలుగుసార్లు ఎన్నికయ్యారు దేవిసింగ్ పటేల్. తాజాగా మరోసారి రాజ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దేవిసింగ్ మృతి చెందడంతో పార్టీ బీజేపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దేవిసింగ్ పటేల్ అంత్యక్రయలు స్వగ్రామమైన బంద్రాకచ్చాలో నిర్వహించనున్నారు.

Similar News