కేంద్ర బడ్జెట్ లో రైల్వేకు సంబంధించిన ముఖ్యాంశాలు

Update: 2018-02-01 11:04 GMT

2018-19 బడ్జెట్ లో రైల్వే భద్రతకు, ప్రయాణికుల భద్రతకు కేంద్ర ఆర్థిక మంత్రి పెద్ద పీట వేశారు. బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సమయంలో ఆయన ప్రసంగిస్తూ, రైల్వే విద్యుదీకరణకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. అన్ని రైళ్లో వైఫై, సీసీ టీవీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైల్వేకు సంబంధించిన ప్రధానాంశాలు ఇవే.

రైల్వే బడ్జెట్‌ కేటాయింపులు: 
రైల్వే విద్యుద్దీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం
4 వేల కి.మీ విద్యుద్దీకరణ పనులు చేపట్టాం
రైల్వేభద్రతలో భాగంగా ట్రాక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పెద్దపీట
4200 మానవరహిత రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ల తొలగింపు
అన్ని రైళ్లలో వైఫై, సీసీ టీవీలు ఏర్పాటు చేయడమే లక్ష్యం
ముంబై లోకల్‌ రైళ్ల కోసం 90 కి.మీ మేర డబుల్‌ లైన్
ముంబై సబర్బన్‌ రైల్వేకు రూ.17వేల కోట్లు
బెంగళూరు మెట్రోకు రూ.17వేల కోట్లు
రైల్వేస్టేషన్ల పరిసరాలలో వాణిజ్య సముదాయాల అభివృద్ధి
 

Similar News