రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బిగ్ డెసిషన్

Update: 2018-01-21 10:22 GMT

ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుకు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై.. నోటిఫికేషన్ కూడా జారీ చేసింది రాష్ట్రపతి భవన్.

పార్లమెంటరీ సెక్రటరీలుగా.. లాభదాయక పదవులు అనుభవించిన 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. సీఈసీ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుకు ప్రెసిడెంట్ కోవింద్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోవింద్ డెసిషన్‌.. కేజ్రీవాల్ సర్కార్‌ను ఒక్క కుదుపు కుదిపేసిందని చెప్పొచ్చు.

Similar News