భర్త మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృతవర్షిణి

Update: 2018-09-16 04:47 GMT

మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్‌ మృతదేహాన్ని చూసి భార్య అమృత వర్షిణి బోరున విలపించింది.  ప్రాణానికి ప్రాణంలా ప్రేమించిన భర్త  విగతజీవిలా పడివుండటాన్ని చూసిన అమృత వర్షిణి దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. ఆసుపత్రి నుంచి ఆమెను ప్రత్యేక వాహనంలో ప్రణయ్ మృతదేహం వద్దకు తీసుకువచ్చారు పోలీసులు. భర్తను చూసిన అమృత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది..  భర్త లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదిస్తోంది. కాగా ఆదివారం ఉదయం 11గంటకు మిర్యాలగూడలో ప్రణయ్ అంత్యక్రియలు జరగనున్నాయి.   ప్రస్తుతం మిర్యాలగూడలో దళిత సంఘాల ఆందోళనతో టెన్షన్‌ వాతావరణం కొనసాగుతోంది. 

Similar News