ఆంధ్రుల అభయహస్తంగా పేరొందిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా అయన బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. దీనికి 'యాత్ర' అనే టైటిల్ నామకరణం చేసి ఇప్పటికే షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫిలింనగర్లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ప్రమోషన్ బాధ్యతలు చూడటానికి నటుడు ప్రభాస్ ముందుకొచ్చాడట. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన విజయ్ కు ప్రభాస్ మంచి సన్నిహితుడు. అందుకే ఈ సినిమా విడుదలయ్యే సమయానికి ప్రమోషన్లలో పాల్గొని తన వంతు సహకారం అందిస్తానని విజయ్ కు మాటిచ్చారట ప్రభాస్.