పవన్ కల్యాణ్ - కత్తిమహేష్ వివాదంలో పూనమ్ కౌర్ ఎంటర్ అవ్వడం. మహేష్ పై కామెంట్స్ చేస్తూ పవన్ కల్యాణ్ కు మద్దతిస్తూ ట్వీట్ చేయడం. అందుకు ప్రతిస్పందనగా మహేష్ సవాల్ విసరడం. అనంతరం ప్రెస్ మీట్ పెట్టీమరి పవన్ -పూనమ్ వ్యక్తిగత జీవితాలపై ఆరు ప్రశ్నలకు సంధించడం జరిగింది. అయితే మహేష్ వేసిన ఆరు ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఆరు ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు తెలుస్తోంది. వాటిలో పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ క్షుద్ర పూజలు నిర్వహించారని..అందులో పూనమ్ కౌర్ ఎందుకు పాల్గొందనే విషయం పై ఓ టీవీ ఛానల్ నిర్వహించిన లైవ్ డిబెట్ లో బట్టబయలైంది. క్షుద్ర పూజలు కాదని తిరుమల సమీపంలో ఓ గ్రామంలో ఉన్న దేవాలయంలో పూజలు చేశారని ఆ పూజలు నిర్వహించిన బ్రాహ్మణుడు తెలిపిన విషయం తెలిసిందే . ఇక పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న ఆసుపత్రి ఏది? ఆ బిల్స్ కట్టింది ఎవరు? అనే ప్రశ్నసంధించారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరికినట్లు సమాచారం.
జల్సా సినిమా లో మొదట ఇలియానా అక్కగా అప్పుడే వెలుగులోకి వస్తున్న పూనమ్ కౌర్ ను తీసుకోవాల్సి ఉంది. అయితే కొన్ని అన్వేక కారణాల వల్ల పూనమ్ కౌర్ బదులు కమలిని ముఖర్జీని త్రివిక్రమ్ సెలక్ట్ చేసుకోవడంతో సదరు హీరోయిన్ షాక్ గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సినిమా ఎంపిక విషయంలో ఎన్నోసినిమాలు పూనమ్ కౌర్ మిస్ చేసుకుందని..అదే సమయంలో జల్సా లో అవకాశం రావడంతో సంతోషించింది. ఆదే సమయంలో పూనమ్ కు డైరక్టర్ త్రివిక్రమ్ హ్యాండ్ ఇవ్వడంతో నెలలు తరబడి డిప్రెషన్ లోకి వెళ్లినట్లు టాక్. ఆ తరువాత సినిమాలు కూడా వరుస పెట్టి బెడిసికొట్టడంతో త్రివిక్రమ్ మీద కోపంతో ఆత్మహత్యా యత్నం చేసింది ఆమె.
ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తరపున ఆస్పత్రికి వెళ్లి బిల్లు కట్టి , భవిష్యత్తులో సాయం చేస్తానని మాట ఇచ్చి సంధి కుదిర్చాడు అప్పట్లో . ఆ మాట కోసమే ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ , చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా రికమెండ్ చేసాడు అంట.అదీ పూనమ్ కౌర్ సూసైడ్ వెనుక అసలు కథ. చూద్దాం కత్తి , పవన్ మధ్యలో పూనమ్ స్టోరీ ఇంకా ఎంత కాలం నడుస్తోందో.