పొత్తుల్లో భాగంగానే టికెట్ లేట్..

Update: 2018-11-18 09:04 GMT

మహా కూటమి పొత్తుల్లో భాగంగానే తనకు టికెట్ లేట్ అయిందని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో కాంగ్రెస్ బుజ్జగింపుల కమిటీని ఆయన కలిశారు. వీలున్నంతవరకు అందరికి కాంగ్రెస్ హైకమాండ్ న్యాయం చేస్తుందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తను 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అయినా మరీ అధిష్ఠానం ఎందుకుఅలాచేసిందో తెలియదు కాని పార్టీ కలిపితీసుకపోయే భాధ్యతను మరింత భుజనవెసుకోని గెలుపుకోసమే కృషిచేస్తనని పొన్నాల తెలిపారు. అప్రజస్వామిక పాలన, గఢీలపాలన, నియంతపారిపాలన,ఏకప‍క్షపాలన, అవినీతిపాలన వీటన్నింటీని అంతమెందించేందుకే అన్ని పక్షాలు కలిసి ఈ ప్రజాఫ్రంట్ ఏర్పడిందని పొన్నాల వ్యాఖ్యనించారు.
 

Similar News