తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేశారు. ఉదయం పది గంటల వరకు తెలంగాణలో 11 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. హైదరాబాద్ 7శాతం, రంగారెడ్డి జిల్లాలో 8శాతం, మహబూబ్నగర్ జిల్లాలో 6శాతం, నల్గొండ జిల్లాలో 11శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 9.8శాతం, కరీంనగర్ జిల్లాలో 7శాతం, ఖమ్మం జిల్లాలో 10శాతం, వరంగల్ జిల్లాలో 7శాతం, మెదక్ జిల్లాలో 7శాతం, నిజామాబాద్ జిల్లాలో 6శాతం, కొమురం భీం జిల్లాలో 8.2శాతం, పెద్దపల్లి జిల్లాలో 8శాతం, జగిత్యాల జిల్లాలో 18 శాతం, సిద్దిపేట జిల్లాలో 11శాతం పోలింగ్ నమోదు అయ్యింది.