ఎప్పుడూ ఉప్పు , నిప్పులా ఉండే డీఎంకె, బీజేపీలు పార్టీలు నేడు కౌగిలించుకున్నాయి. డీఎంకే అగ్రనేతలు బీజేపీ కార్యాలయానికి వెళ్లి మరి బీజేపీ నేతలను కలిశారు. కరుణానిధి వారసులు స్టాలిన్, కనిమొళి… వాజ్పేయి చితాభస్మానికి పుష్పాంజలి ఘటించారు. తమ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన డీఎంకే నాయకులను.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సౌందరరాజన్, కేంద్ర మంత్రి రాధాకృష్ణ ఎదురెళ్లి ఆహ్వానం పలికారు. బీజేపీ హిందూత్వ ఆధారంగా రాజకీయాలు చేస్తుండగా.. డీఎంకే నాయకులు నాస్తికులు. అయితే.. వాజ్పేయి ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల వాజ్పేయి మరణించారు. దీంతో అన్ని రాష్ట్రాలకు వాజ్పేయి చితాభస్మం పంపించారు. కాగా చితాభస్మం చెన్నై తీసుకొచ్చారని తెలిసి.. స్టాలిన్, కనిమొళి బీజేపీ ఆఫీస్కు వెళ్లి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా దేశానికి వాజ్పేయి చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు.