ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వచ్చి వారితో ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే బహిరంగసభల్లో చెబుతున్నారు. అయితే పోలీసులు సీఎం కేసీఆర్ మాటలను చెవికెక్కించుకోవడం లేదు. తమకు ఇష్టమొచ్చినట్లే మెనార్క్ల్లా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు స్టేషన్లో అడుగు పెట్టే ముందు చెప్పులు బయట వదిలేసి రావాలంటారు. అదే పోలీసులు కేసు విచారణకు వెళ్లినపుడు మాత్రం సీఎంలు, పీఎంలు కూడా వ్యవహరించినట్లు బిల్డప్ ఇస్తున్నారు. జవహర్నగర్ పీఎస్ పరిధిలో ఓ హత్య కేసు విచారణకు ఓ ఇంటికి వెళ్లిన పోలీస్ అధికారి తన ఇంటిలా ఎలా కూర్చోన్నాడో చూడండి. బాధిత మహిళ మంచంపై కూర్చోని ఫిర్యాదు రాస్తుంటే అధికారి మాత్రం నిర్లక్ష్యంగా కాళ్లు మంచంపై పెట్టి కూర్చున్నాడు. పోలీస్ అధికారి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నారు.