కుక్కతోక వంకర పాకిస్థాన్ వక్రబుద్ధి రెండూ మారవు.. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నా పాక్ వక్రబుద్ధి మారడం లేదు ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచింది. ఓ వైపు విరమణ పాటిద్దామని చెబుతూనే.. ఇంకోవైపు కాల్పులతో కవ్విస్తోంది. అదును చూసుకుని భారత సైన్యంపై అక్రమంగా దాడులు చేస్తోంది. ఆదివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్ పరగ్వాల్ సెక్టార్లోని అక్నూర్లో జమాన్ బెళా పోస్టుపై పాకిస్తాన్ రేంజర్లు దొంగ చాటుగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు భారతీయ జవాన్లు సహా మరో ముగ్గురు పౌరులు మృతిచెందారు. దీంతో భారత్ దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. పాక్ అక్రమ స్థావరాలపై ప్రతి కాల్పులు జరుపుతున్నాయి. ఇదిలావుంటే పాక్ అక్రమ దాడి గురించి ప్రధాని ఆరా తీసినట్టు సమాచారం.