గులాబీ దళంతో దోస్తు కాదట!

Update: 2018-09-01 07:33 GMT

గులాబీ దళంతో బరిలో దోస్తి లేదట,

కారు కమలం ఎన్నికలలో కలవ లేదట,

సహకరించుకొడం సై అన్నటు కాదట,

బాజాపా పెద్ద అమిత్ షా తేల్చేశనట 
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ తో పొత్తు పెట్టుకుంటుందనే వార్త నిజం కాదట. ఈ రెండు పార్టీలు కచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయని కాంగ్రెస్ ఘంటా పధంగా చెబుతోంది. ఇందుకు ఉదాహరణ ఇటీవల పార్లమెంటులో టిఆర్ఎస్ ఎంపీల తీరు.. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నేతలను స్వయంగా పిలిచి మరీ మాట్లాడటమేనని అంటున్నారు. అయితే ఈ పొత్తు వార్తల గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చేశారు. కర్నూల్ జిల్లా  మంత్రాలయం వెళ్లేందుకు గురువారం హైదరాబాద్‌ వచ్చిన ఆయన శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ముందస్తుకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.

Similar News