ప్రేమంచి పెళ్లి చేసుకున్న భార్యపై అత్యంత పాశవికంగా దాడి చేసి గాయపరిచిన ఎస్ఐ జితేందర్ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో జితేందర్పై కుట్ర జరిగిందంటూ ఎస్సీ సంఘాలు ఆరోపించాయి. జితేందర్ సొంత గ్రామంలో జరిగిన గొడవలను వ్యక్తిగతంగా తీసుకున్న ఓ పార్టీకి చెందిన నేతలు పథకం ప్రకారం కుట్ర చేశారంటూ ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంలో ఆత్మరక్షణ కోసమే జితేందర్ అత్త, భార్యపై దాడికి దిగాల్సి వచ్చిందన్నారు.