ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం

Update: 2018-08-21 14:18 GMT

ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభత్వం నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్ కు కొత్త గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్‌ను నియమించింది. ఆయన గతంలో బీహార్ గవర్నర్‌గా ఉన్నారు. కాగా, బీహార్ కొత్త గవర్నర్‌గా లాల్జీ టాండన్‌ను నియమించారు. సిక్కిం గవర్నర్‌గా గంగా ప్రసాద్, మేఘాలయ గవర్నర్‌గా తథాగత రాయ్, త్రిపుర గవర్నర్‌గా కప్తాన్ సింగ్ సోలంకిలను కేంద్ర హోమ్ శాఖా  మంగళవారంనాడు నియమించింది. అలాగే, హర్యానా గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్యహాస్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్యను నియమిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News