నిజామాబాద్ లో దారుణం.. మహిళను ఛాతీపై తన్నిన ప్రజాప్రతినిధి!

Update: 2018-06-17 09:53 GMT

నిజామాబాద్ జిల్లాలో  ఓ ప్రజా ప్రతినిధి దాష్టికం ప్రదర్శించాడు. ఓ మహిళను ఛాతీపై తన్ని అకారణంగా ఆమెను దూషించాడు. వివరాల్లోకివెళితే నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎంపీపీ గోపి. ధర్పల్లి గ్రామానికి  రాజవ్వ కుటుంబానికి.. ఎంపీపీ గోపికి మధ్య కొద్దిరోజులుగా స్థల వివాదం నడుస్తోంది.  తన కొంతకాలం క్రితం గోపి తన గెస్ట్‌హౌస్‌ను రాజవ్వకు అమ్మాడు.  దీనికోసం 33 లక్షల రూపాయలు చెల్లించి.. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది రాజవ్వ. కానీ గోపి ఇప్పటికీ గెస్ట్‌హౌస్‌ ఖాళీ చేయకుండా.. తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో.. ఇవాళ అతని ఇంటి దగ్గర ఆందోళన చేసింది బాధితురాలు. ఈ క్రమంలో రేట్ ఎక్కువగా ఉంది.. మరిన్ని డబ్బులు  కావాలంటూ గోపి డిమాండ్ చేయడంతో కోపంతో.. అతడ్ని చెప్పుతో కొట్టింది మహిళ. వెంటనే ఆమె ఛాతిపై కాలితో.. ఆమెను దూషించాడు గోపి.దీంతో ఆ పక్కనే ఉన్న సదరు మహిళ కుటుంబ సభ్యులు ఎంపీపీని తోసేశారు. రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదుతో గోపిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Similar News