తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్కు పంపించారు. రాజీనామాకు గల కారణాలను బుధవారం మీడియా సమావేశంలో ప్రకటిస్తామని చెప్పారు. కొన్నాళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.