ప్రియుడికి కుమార్తెను ఇచ్చి పెళ్లి.. ఆపై..

Update: 2018-06-28 02:33 GMT

ప్రియుడికి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి. ఆపై జైల్లో ఊచలు లెక్కబెడుతోంది ఓ మహిళ. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం ఉత్తమపాళయం చిన్న ఓబులాపురం వినాయక ఆలయం వీధిలో జరిగింది. వినాయక ఆలయం వీధికి చెందిన మహిళ(38) అదే ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్(22)వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి భర్త ఆమెను మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. ఈ క్రమంలో  వారంరోజుల కిందట భార్య చేస్తున్న అనైతిక పనికి మనస్థాపం చెంది ఇంటినుంచి వెళిపోయాడు. తన కుమర్తెను రాజ్ కుమార్ ఇచ్చి పెళ్లి చేస్తే తమ వివాహితర సంబంధానికి అడ్డు ఉండదనే కారణంతో కూతురు(13) అతడికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమైంది. విషయం తెలుసుకున్న  మహిళ భర్త పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లి నిలుపుదల చేశారు. అనంతరం బాలికను బాలసదన్ కు తరలించి.. సదరు మహిళ, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. 

Similar News