రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్నూరుకాపుల జిల్లా సమావేశంలో...అగ్నిప్రమాదం జరిగింది. మంత్రి జోగు రామన్న మాట్లాడుతున్న సమయంలో....షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి షామియానాలు, కుర్చీలు కాలిపోయాయ్. వెంటనే అప్రమత్తమైన మీటింగ్లో ఉన్న నేతలు మంటలను అర్పేసి అదుపులోకి తీసుకొచ్చారు.