ఈశాన్య రాష్ట్రాల తీర్పు వెలువడుతోంది. మేఘాలయలో అధికార కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ వెలువడిన ఎన్నికల ఫలితాల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులు 17 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఎన్పీపీ 7, భాజపా 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు 6 చోట్ల ముందంజలో ఉన్నారు. ఇక్కడ పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను గెలుచుకునే దిశగా సాగుతోంది. 60 స్థానాలకుగాను 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఓ ఎన్సీపీ అభ్యర్థి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోగా ఇక్కడ ఎన్నిక వాయిదా వేశారు.