ప్రియుడి చేతిలో వివాహిత సజీవ దహనం

Update: 2018-10-24 06:00 GMT

హైదరాబాద్ సంతోష్‌ నగర్‌లో దారుణం జరిగింది. పంజాబ్‌కు చెందిన సానియాపై ప్రియుడు దాడి చేసి సజీవ దహనం చేశాడు. గత మూడేళ్లుగా సానియా, సల్మాన్‌లు సహజీవనం చేస్తున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఇరువురి మధ్య విభేదాలు రావడంతో ప్రియుడికి సానియా దూరంగా ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో తనను పట్టించుకోవడం లేదని ఆరోపించిన సల్మాన్ ఇంటికి వచ్చి గొడవకు దిగారు. ఈ సందర్భంగా తనతో తెచ్చుకున్న కిరోసిన్ పోసి నిప్పంటించాడు.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సానియాను స్ధానికులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందింది. దాడి అనంతరం ప్రియుడు సల్మాన్ సంతోష్ నగర్ పోలిస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

Similar News