మహాకూటమి సీట్లు ఖరారు చేసిన కుంతియా.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..

Update: 2018-11-08 13:15 GMT

మహాకూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించేది ఖరారు చేశారు రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ ఆర్సి కుంతియా.. కూటమిలో భాగంగా టీడీపీకి 14 , టీజెఎస్ కు 8 , సిపిఐ కి 3 స్థానాలు సర్దుబాటు చేసినట్టు ప్రకటించారు. కాగా మొత్తం 25 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించినట్టు అయన చెప్పారు. మిగిలిన 94 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇంటి పార్టీకి ఒక సీటు కేటాయించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఇక74 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితాను సిద్ధం చేసినట్టు కుంతియా వెల్లడించారు. 

Similar News