రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య..!

Update: 2017-12-18 05:33 GMT

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో చోటుచేసుకుంది.. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదనే కారణంతో వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది.. రైలు కింద పడటంతో వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జు నుజ్జయ్యాయి.. దీంతో ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.. సంఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరిని ఏడిదకు చెందిన సూరిబాబుగా గుర్తించగా , యువతీ వివరాలు లభ్యం కాలేదు.. 
 

Similar News