మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్

Update: 2018-11-07 04:03 GMT

స్త్రీలకు అయ్యప్ప దర్శనం కల్పించాలని ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది మహిళలు బలవంతంగా అయ్యప్పను దర్శించుకుందుకు ప్రయత్నం చేయడంతో  కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో స్త్రీలకు అయ్యప్ప దేవుడి దర్శనం కల్పించే విషయంపై  సినీనటుడు ప్రకాష్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్త్రీ అంటే తల్లి. మనం పుడమిని తల్లితో పోలుస్తాం. మనకు జన్మనిచ్చేదీ ఆ మహిళే. మరి అదే మహిళను పూజలకు దూరంగా ఉంచడంలో అర్థం ఏమిటి? దైవదర్శనానికి అతివలను అనుమతించని భక్తులు భక్తులే కాదు.  అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. 

Similar News