ఏపీకి న్యాయం చేయాలంటూ టీడీపీ ఎంపీలు లోక్సభను స్తంభింపచేశారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో టీడీపీ ఎంపీలు తమ నిరసనకు కొనసాగించారు. పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. విభజన హామీలు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చూస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను రేపటి(మంగళవారం)కి వాయిదా వేశారు.