వైసీపీకి కీలకనేత గుడ్ బై..!

Update: 2017-12-20 10:16 GMT

గత మూడున్నరేళ్ళనుండి ఏపీలోని ప్రతిపక్ష వైసీపీ నుంచి అధికార టీడీపీలోకి వలసలు సాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే ఆ పార్టీనుంచి 22 మంది శాసనసభ్యులు చేజారిపోగా కొందరు కీలకనేతలు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు తాజాగా ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ తగిలింది. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతున్న రవికాంత్ పసుపు కండువా కప్పుకున్నారు. ఇంకా కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం ఓ వైపు జరుగుతుండగా... కింది స్థాయి నాయకులను కూడా ఆకర్షించే పనిలో టీడీపీ బిజీగా ఉంది. ఇందులో భాగంగానే రవికాంత్ ను టీడీపీలోకి ఆకర్షించగలిగింది. 

Similar News