ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కి మరో షాక్ తగిలింది. దాణా స్కామ్ మూడో కేసులో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. చైబాసా ట్రెజరీ కేసులో లాలూని దోషిగా తేల్చిన న్యాయస్థానం రేపు శిక్షలు ఖరారు చేయనుంది. లాలూతోపాటు మాజీ సీఎం జగన్నాథమిశ్రాని కూడా సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. ఇప్పటికే 2 కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూకి ఇది మరో పెద్ద షాక్.