లగడపాటి సర్వేపై కేటీఆర్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. లగడపాటిది సర్వే కాదు చిలక జోస్యం అన్నారు. చివరి నిమిషంలో సర్వేల పేరుతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. చంద్రబాబు ఒత్తిడితోనే లగడపాటి తన సర్వే ఫలితాన్ని మార్చారని కేటీఆర్ ఆరోపించారు. టీఆర్ఎస్కు 65 నుంచి 70 సీట్లు వస్తాయంటూ నవంబర్ 20న లగడపాటి తనకు పంపిన మెసేజ్ను ట్విట్టర్లో బయటపెట్టారు. సర్వే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రను బయటపెట్టేందుకే తాను ఆ మెసేజ్ను షేర్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. లగడపాటి, చంద్రబాబులు తెలంగాణలో పొలిటికల్ టూరిస్టులన్న కేటీఆర్ వీళ్లంతా డిసెంబర్ 11 తర్వాత తట్టాబుట్టా సర్దేస్తారని సెటైర్లు వేశారు.