కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్ కేసులో తీర్పును రిజర్వులో పెట్టింది హైకోర్టు. కోమటిరెడ్డి, సంపత్ శాసన సభ్యత్వాల రద్దు చెల్లదన్న హైకోర్టు తీర్పును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాలు చేయడంతో... ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.... తీర్పును రిజర్వులో పెట్టింది. వేసవి సెలవుల అనంతరం తీర్పు ప్రకటించనుంది.