కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 13న ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈరోజు సాయంత్రం లేక రేపు ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్లో చేరే ముందు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన భేటీ అవుతారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసే విషయాలు, పార్టీలో తాను పోషించాల్సిన పాత్రపై ఆయన చర్చలు జరుపుతారు.